జైపూర్ : రాజస్థాన్లోని జలోర్లో స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 2:26 గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైంది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. జోధ్పూర్కు 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున 3:30 గంటలకు జోధ్పూర్లో స్వల్ప భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
An earthquake with a magnitude of 4.6 on the Richter Scale hit Jalore, Jalore today at 2:26 am, according to National Centre for Seismology
— ANI (@ANI) November 19, 2021
Image Source: National Center for Seismology pic.twitter.com/pNFoyDyaPH