న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నిరసనల వల్ల టాటా మోటార్స్కు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఆర్బిట్రల్ ట్రైబ్యునల్ సోమవారం తీర్పు చెప్పింది. టాటా మోటార్స్కు నష్టపరిహారంగా రూ.765.78 కోట్లు చెల్లించాలని మమత సర్కారును ఆదేశించింది.
దీనిపై తృణమూల్ స్పందిస్తూ.. ఈ తీర్పు చిట్ట చివరిది కాదని, న్యాయ పోరాటానికి అవకాశాలు ఇంకా ఉన్నాయని పేర్కొన్నది. నానో కార్ల కంపెనీని బెంగాల్లోని సింగూరులో ఏర్పాటు చేయాలని టాటా మోటార్స్ ప్రయత్నించింది. అప్పట్లో సీపీఎం ప్రభుత్వం ఉండేది. టీఎంసీ ఆందోళన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు గుజరాత్ తరలిపోయింది.