న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ‘ఐరన్డోమ్’ తరహాలో త్వరలో మనకూ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. శత్రు క్షిపణులను, రాకెట్లను గాల్లోనే తుత్తునియలు చేయగల ఐరన్డోమ్ వ్యవస్థను ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవస్థ కారణంగానే హమాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్కు తక్కువ ప్రాణనష్టం జరిగింది.
ఈ క్రమంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కూడా సొంతంగా ఐరన్డోమ్ తరహా రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రాజెక్టు కుశ పేరుతో దీనిని అభివృద్ధి చేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2028-29 నాటికి ఇది అందుబాటులోకి రానుంది.