అహ్మదాబాద్: అముల్ సంస్థ పాలపై రేటును పెంచింది. లీటరు పాలపై రెండు రూపాయలు పెంచినట్లు పేర్కొన్నది. మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. చివరిసారి జూలై 2021లో అముల్ సంస్థ పాల ధరను పెంచింది. అముల్ బ్రాండ్లో వస్తున్న అన్ని పాల ఉత్పత్తులపై పెరిగిన ధరలు వర్తించనున్నాయి. గోల్డ్, తాజా వేరియంట్ పాలపై కూడా ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఆవు, బర్రె పాలకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులకు కొత్త రేటు వర్తిస్తుంది. కొత్త ధర ప్రకారం.. 500 మిల్లీలీటర్ల అముల్ గోల్డ్ పాలు ఇప్పుడు రూ.30కు లభిస్తుంది. అముల్ తాజా వేరియంట్ రూ.24 అరలీటరు వస్తుంది. హాఫ్ లీటర్ అముల్ శక్తిని 27కి అమ్మనున్నారు.