ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్(Amrutha Fadnavis) .. ముంబైకి చెందిన ఓ లేడీ డిజైనర్(designer)పై కేసు బుక్ చేశారు. అనిక్షా అనే మహిళతో పాటు ఆమె తండ్రిపై ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు నమోదు చేశారు. డిజైనర్ అనిక్షా(Aniksha) తనను బెదిరిస్తున్నట్లు, తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు అమృత తన ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. ఫిబ్రవరి 20వ తేదీ ఆ ఎఫ్ఐఆర్ను ఆమె పోలీసులకు ఇచ్చారు.
డిజైనర్ తండ్రి ఓ క్రిమినల్ కేసు(criminal case)లో ఇరుక్కున్నారని, ఆయన్ను కాపాడేందుకు చొరవ చూపాలని, దాని కోసం కోటి రూపాయాలు ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించినట్లు అమృతా ఫడ్నవీస్ ఆరోపించారు. 2021 నవంబర్లో అమృతను తొలిసారి ఆ మహిళ కలిశారు. ఫిబ్రవరి 18,19 తేదీల్లో డిజైనర్ అనిక్షా తనకు వీడియో క్లిప్లను, వాయిస్ నోట్స్, మెసేజ్లను పంపినట్లు అమృత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అమృత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు(mumbai police) ఆ డిజైనర్పై కేసు నమోదు చేశారు. ఆ మహిళ, ఆమె తండ్రి కుట్ర పన్నుతున్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దుస్తులు, జ్వలరీ,ఫూట్వియర్కు చెందిన వ్యాపారం చేస్తున్న మహిళ అమృతను కలిశారు. తాను రూపొందిచిన దుస్తులు, జ్వలరీని పబ్లిక్ ఈవెంట్స్(public events) సమయంలో వేసుకోవాలని కోరినట్లు అమృత చెప్పారు. ప్రమోషన్ కోసం ఆ పనిచేయాలని ఆ డిజైనర్ కోరినట్లు అమృత వెల్లడించారు.