న్యూఢిల్లీ, జూలై 3: షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ సహా ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో పలువురిపై అవినీతి, ఈడీ కేసులు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని అధికార బీజేపీ.. ఈ తిరుగుబాటు పర్వం నడిపిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
బీజేపీ ‘వాషింగ్ మెషిన్’తో ఇక వారంతా క్లీన్ చిట్ పొందుతారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఎత్తిచూపారు. తిరుగుబాటుకు ప్రధాన సూత్రధారిగా ఉన్న అజిత్ పవార్తో పాటు, ఆయన వెంట వచ్చిన మరో కీలక నేత ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్, ఆయన కుటుంబసభ్యులు, హసన్ ముష్రిఫ్, అదితి తట్కరే తండ్రి సునీల్ తట్కరే గత కొన్నేండ్లుగా పలు కేసులు ఎదుర్కొంటున్నారు.