Amit Shah : ఢిల్లీ బాంబు పేలుడు ఘటన గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)మాట్లాడారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కనిపెడుతామని ఆయన తెలిపారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీ సతీశ్ గుల్చా, స్పెషల్ బ్రాంచీ ఇంఛార్జిలను అడిగి పేలుడుకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న షా.. ఎక్స్ వేదికగా స్పందించారు.
‘ఈరోజు సాయంత్ర 7 గంటల ప్రాంతంలో హ్యుండాయ్ ఐ20 కారులో పేలుడు జరిగింది. ఎర్రకోటకు సమీపంలోని సుభాష్ మార్గ్ కూడలి వద్ద ఈ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటన కారణంగా పలువురు పాదచారులు గాయపడగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం కొందరు ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. పేలుడు గురించి తెలిసిన పది నిమిషాల్లో అన్ని బృందాలు అక్కడకు చేరుకున్నాయి. క్రైమ్ బ్రాంచ్తో పాటు ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ ఘటనా స్థలికి వెళ్లాయి.
#WATCH | Delhi: Blast near Red Fort Metro Station | Union Home Minister Amit Shah says “This evening, around 7 pm, a blast occurred in a Hyundai i20 car at the Subhash Marg traffic signal near the Red Fort in Delhi. The blast injured some pedestrians and damaged some vehicles.… pic.twitter.com/BfRei3r3tx
— ANI (@ANI) November 10, 2025
ఈ పేలుడు గురించి ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. సిగ్నల్ సమీపంలోని సీసీ టీవీల పుటేజీని పరిశీలించాలని ఆదేశించాను. పేలుడు తర్వాత అక్కడికి చేరుకున్న ఢిల్లీ సీపీ, స్పెషల్ బ్రాంచ్ ఇంచార్జితో మాట్లాడాను. ఈ దాడికి సంబంధించిన పూర్తి సమాచారం దర్యాప్తులో వెలుగులోకి వస్తుంది. అందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతాం. ఇన్విస్టిగేషన్ పూర్తయ్యాక వివరాలు ప్రజల ముందు పెడుతాం. నేను వెంటనే పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్తాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శిస్తాను’ అని అమిత్ షా వెల్లడించారు. పేలుడు సంభవించిన కారు హర్యానాలో రిజిష్ట్రేషన్ అయినట్టు పోలీసులు గుర్తించారు. HR267674 నంబర్తో నదామ్ ఖాన్ పేరుతో రిజిష్టర్ అయిందని తెలిసింది.
ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ సిగ్నల్ దగ్గర కారులో సంభవించిన భారీ పేలుడుతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘటనలో ఇప్పటికే 10 మంది మరణించారు. తీవ్రంగా గాయపడిన 34 మందికి లోక్ నాయక్ జయప్రకాశ్ హాస్పిట్లో చికిత్స అందిస్తున్నారు. పేలుడుతో అప్రమత్తమైన పోలీసులు ఎర్రకోట, చాందీని చౌక్ వెళ్లే దారులను మూసేశాం. ఈ దాడికి సూసైడ్ బాంబర్ కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
#WATCH | Delhi: Forensic team arrives at the spot after the blast near Gate no 1 of the Red Fort Metro station in Delhi
Delhi Police Commissioner Satish Golcha said, “Today at around 6.52 pm, a slow-moving vehicle stopped at the red light. An explosion happened in that vehicle,… pic.twitter.com/rQeXcLYQ69
— ANI (@ANI) November 10, 2025