పనాజీ, మే 14: గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాగిన నీళ్ల బాటిల్ ధర రూ.850 అని ఆ రాష్ట్ర మంత్రి రవి నాయక్ బయటపెట్టారు. గోవాలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో నీళ్ల ధర ఆకాశానికి పెరుగుతుందని చెప్తూ.. అమిత్ షా తాగిన నీళ్ల బాటిల్ ధరను వెల్లడించారు.
‘ప్రచారం కోసం వచ్చినప్పుడు హిమాలయ బ్రాండ్ నీళ్లు కావాలని షా అడిగారు. పనాజీ నుంచి 10 కిలోమీటర్ల దూరం నుంచి ఆ నీళ్ల బాటిళ్లను తెప్పించాం. ప్రస్తుతం స్టార్ హోటళ్లలోనూ ఒక్కో నీళ్ల బాటిల్ ధర రూ.150-160 ఉంటున్నది’ అని
తెలిపారు.