న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah).. నక్సల్స్కు వార్నింగ్ ఇచ్చారు. ఆయుధాలను వదిలిపెట్టాలని ఆయన కోరారు. హింసను వీడి ఆయుధాలు అప్పగించాలని, నక్సల్స్ సరెండర్ కావాలని ఆయన తెలిపారు. ఒకవేళ నక్సల్స్ లొంగిపోని పక్షంలో.. ఎరివేత ఆపరేషన్ ముమ్మరంగా చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. చత్తీస్ఘడ్లో నక్సల్ హింసతో లింకున్న 55 మంది బాధితులను ఉద్దేశించి ఆయన తన నివాసంలో మాట్లాడారు. 2026 మార్చి 31వ తేదీన మావోయిస్టులు తమ చివరి శ్వాస పీల్చుకుంటారని మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఈ దేశం నుంచి నక్సల్ హింస, ఐడియాలజీని రూపుమాపాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు మంత్రి షా తెలిపారు.
#WATCH | Union Home Minister Amit Shah met and interacted with the Naxal violence victims from Chhattisgarh, in Delhi pic.twitter.com/T56kUOK1Ms
— ANI (@ANI) September 20, 2024
హింసను వీడాలని నక్సల్స్ను వేడుకుంటున్నానని, ఆయుధాలను విడిచిపెట్టాలని, ఈశాన్య రాష్ట్రాల మిలిటెంట్లు ఆయుధాలను అప్పగించిన తరహాలో నక్సల్స్ లొంగిపోవాలని, ఒకవేళ మీరు వినకుంటే, అప్పుడు నక్సల్ నిర్మూలన చర్యలు చేపడుతామని షా పేర్కొన్నారు. మావోయిస్టులపై జరుపుతున్న ఆపరేషన్లలో.. భద్రతా దళాలు ప్రగతిని సాధించాయని తెలిపారు. ప్రస్తుతం చత్తీస్ఘడ్లోని కేవలం 4 జిల్లాలకే మావోలు పరిమితం అయినట్లు ఆయన వెల్లడించారు. నేపాల్లోని పశుపతినాథ్ నుంచి ఏపీలోని తిరుపతి వరకు కారిడార్ను ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ప్లాన్ చేశారని, కానీ మోదీ సర్కార్ ఆ ప్లాన్ను భగ్నం చేసినట్లు ఆయన చెప్పారు. చత్తీస్ఘడ్లోని నక్సల్ ప్రభావిత ప్రాంత ప్రజలు సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించనున్నట్లు హోంశాఖ మంత్రి తెలిపారు. నక్సల్ ప్రభావిత ప్రజల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని… ఉద్యోగాలు, హెల్త్కేర్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
#WATCH | Union Home Minister Amit Shah says, “We will end Naxalism. I appeal to (Naxalites) to surrender before the law, give up their weapons. In many places in the North-East and Kashmir, many people have given up their weapons and joined the mainstream. You are also welcome to… https://t.co/fvlyVxH52u pic.twitter.com/yaAOAKhXPC
— ANI (@ANI) September 20, 2024