న్యూఢిల్లీ : ఎక్సైజ్ పాలసీ మరో రెండు నెలలు పొడిగించినా దేశ రాజధానిలో మద్యం కొరత మందు బాబులను వెంటాడుతోంది. కస్టమర్లు పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేయడంతో పాటు షాపుల మూసివేతకు ముందు బల్క్ ఆర్డర్లకు విక్రేతలు విముఖత చూపుతుండటంతో మద్యం కొరత నెలకొంది.
వచ్చే నెల నుంచి ఢిల్లీలోని మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ సంస్ధలే నిర్వహిస్తాయి. ఢిల్లీలోని ఏ ప్రాంతంలోనూ మద్యం కొరత లేకుండా చూసేందుకు నగరంలో 500 మద్యం దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. నూతన ఎక్సైజ్ విధానం అమలు కోసం ఢిల్లీ నగరాన్ని ప్రభుత్వం 32 జోన్లుగా విభజించింది.
ఢిల్లీలో బార్లు, రెస్టారెంట్లలో మద్యం సరఫరాలు కొనసాగినా మద్యం దుకాణదారులు గురుగ్రాం, నోయిడా వంటి ప్రాంతాల నుంచి మద్యం సరఫరాలకు మొగ్గుచూపడతంతో మద్యం ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.