లండన్ : ప్రపంచవ్యాప్తంగా భారతీయ రుచులను ఎంతో మంది ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. ఈ జాబితాలో ప్రముఖ అమెరికన్ సింగర్, రచయిత పింక్ (Viral Post) చేరిపోయారు. బ్రిటన్లోని ఆశా భోస్లే రెస్టారెంట్ను సందర్శించిన ఆమె చికెన్ కర్రీ, నాన్ను ఇష్టంగా ఆరగించారు. బర్మింగ్హాంలో సమ్మర్ కార్నివాల్కు ముందు ఆమె యూకేలో ఇండియన్ రెస్టారెంట్ను సందర్శించి దేశీ రుచులను ఎంజాయ్ చేశారు.
ఆశా పేరుతో యూకేలో వెలిసిన ఈ రెస్టారెంట్ను గతంలో టామ్ క్రూజ్ సందర్శించి ఇక్కడి ఫుడ్ను ఎంతో ఇష్టంగా తిన్నారు. ఇక సింగర్ పింక్ భారత రెస్టారెంట్లో చేసిన సందడి విషయానికి వస్తే..ఆమె కొన్ని సమోసాలు, కుర్కురే మష్రూమ్నూ టేస్ట్ చేశారు. మెయిన్ కోర్స్లో ఆమె చెట్టినాడ్ చికెన్, దాబా చికెన్ కర్రీని నాన్తో కలిపి ఆరగించారు.
When the stars come to #Birmingham… They head to Asha’s 🌟🌟🌟
It was a pleasure to welcome @Pink ahead of her sell-out show this evening at Villa Park. In honour of P!NK’s visit, our expert mixologists created a new Gin-based cocktail, but it’s yet to be named… pic.twitter.com/Tfk3w8cjIj
— Asha’s (@Ashas_UK) June 13, 2023
స్టార్లు ఎవరైనా బర్మింగ్హాం పర్యటిస్తే వారు ఆశాకు వస్తారు..వారికి ఇదే మా స్వాగతం అని ఆశా రెస్టారెంట్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆశా రెస్టారెంట్లో ఆతిధ్యాన్ని స్వీకరించిన పింక్ ఇక్కడి ఆహారం చాలా బాగుందని ప్రశంసించారని బర్మింగ్హాం మెయిల్ పేర్కొంది. గత రాత్రి నేను నా జీవితంలోనే బెస్ట్ ఇండియన్ ఫుడ్ ఎంజాయ్ చేశానని కాన్సర్ట్లో తన ఫ్యాన్స్ను ఉద్దేశించి కూడా పింక్ పేర్కొంది.
Read More :