న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించేందుకు సరికొత్త ఇమ్యూనోథెరపీ పద్ధతిని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా, కేవలం క్యాన్సర్ కణాలపైనే పనిచేసే ఈ కొత్త పద్ధతిని వర్జీనియా టెక్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్కు చెందిన పరిశోధకులు రూపొందించారు. సైటోకిన్ అనే ప్రొటీన్లను వినియోగించి ఈ చికిత్స చేస్తారు.
ఈ కొత్త ఇమ్యూనోథెరపీ ద్వారా శరీరంలోని రోగ నిరోధక కణాలు.. క్యాన్సర్ కణాలతో పోరాడేలా, ఇతర కణజాలాలకు, అవయవాలకు క్యాన్సర్ కణతులు సోకకుండా సైటోకిన్లను పెంపొందిస్తాయి. ప్రస్తుతం చేస్తున్న కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకమైన కణాలకు కూడా నష్టం జరుగుతుంది. దీంతో వెంట్రుకలు ఊడిపోవడం, అలసట వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.