ఇండియాను ఇకపై కేవలం భారత్ అని పిలవాలంటే కేంద్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఒకటిని సవరించాల్సి ఉంటుంది. సవరణ బిల్లును పార్లమెంట్లో సాధారణ మెజారిటీ లేదా ప్రత్యేక మెజారిటీతో ఆమోదించుకోవచ్చునని ఆర్టికల్ 368 సూచిస్తున్నది. రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ను.. ఉదాహరణకు కొత్త రాష్ట్రం ఏర్పాటును సాధారణ మెజారిటీ (50శాతం కంటే అధికం)తో సవరణ బిల్లును ఆమోదించవచ్చు. రాజ్యాంగంలోని ఇతర మార్పులకు ఉదాహరణకు ఆర్టికల్ ఒకటిని సవరించాలంటే ప్రత్యేక మెజారిటీ (66 శాతం) ఉండాలి. ఇండియా పేరును భారత్గా మార్చాలంటే ఎంపీలలో మూడింట రెండొంతుల మంది అంగీకారాన్ని తెలపాల్సి ఉంటుంది.