జగత్సింగ్పూర్: ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్ను వీలైనంత వేగంగా దవాఖానకి తీసుకెళ్లడం అంబులెన్స్ డ్రైవర్ల విధి. కానీ, ఒడిశాలోని జగత్సింగ్పూర్లో ఓ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం పేషెంట్ను దవాఖానకి తీసుకెళ్తూ దారిలో తీరిగ్గా రోడ్డు పక్కన ఆపి మందుకొట్టాడు.
అంతేకాదు, పేషెంట్కు కూడా ఓ పెగ్ పోశాడు. స్ట్రెచర్పైనే పడుకొని మరీ ఆ పేషెంట్ మందు తాగాడు. ఈ తతంగాన్ని చూసిన కొందరు ప్రజలు ఇదేంటని డ్రైవర్ను ప్రశ్నించగా.. పేషెంటే తనకు మందు కావాలని అడిగాడని చెప్పాడు.