సూర్యాపేట : సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో వైద్య సేవలు బాగున్నాయి. ఇక్కడి డాక్టర్లు, సిబ్బంది ఎంతో సాహసోపేతమైన సేవలు అందిస్తున్నారని టీ పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన హాస్పిటల్ను సందర్శించి కొవిడ్ చికిత్స తీసుకుంటున్న వారితో మాట్లాడారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా, హుజూర్నగర్, కోదాడలోని ప్రభుత్వ దవాఖానలో కూడా అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీగా దవాఖానల్లో సౌకర్యాలు కల్పించేందుకు తన సహకారం ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అంజద్ అలీ, టీపీసీసీ నాయకులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, జి.నరేందర్ నాయుడు, సాయి నేత తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్