జమ్మూ: అమర్నాథ్ యాత్ర మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ యాత్రకు 3.5 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. జమ్ము-కశ్మీర్ భగవతి నగర్ క్యాంప్ నుంచి ఈ యాత్రను లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.
3,400 మంది యాత్రికులు దక్షిణ కశ్మీర్లోని హిమాలయానికి బయలుదేరారు.