న్యూఢిల్లీ, జూలై 8: ప్రతికూల వాతావరణం, వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడొచ్చన్న హెచ్చరికలతో అధికారులు శనివారం రెండో రోజూ అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. దీంతో బాల్టాల్, పహల్గాం బేస్ క్యాంపుల వద్ద వేలాది మంది భక్తులు నిలిచిపోయారు. ముందుకు వెళ్లలేక, అక్కడ ఉండలేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. జమ్ముకశ్మీర్ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. చిక్కుకుపోయిన యాత్రికుల్లో 200 మంది తెలుగువారు ఉన్నారని తెలుస్తున్నది.