శ్రీనగర్, జూలై 12: అమర్నాథ్ యాత్రలో పాల్గొన్న భక్తుల్లో తాజాగా ఐదుగురు మరణించారు. దీంతో ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. వీరిలో ఒకరు ఐటీబీపీ అధికారి, మరొకరు సేవాదార్ ఉన్నారు. అత్యంత ఎత్తులో ఉన్న మంచు శివుడిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల్లో కొంతమంది గుండెపోటుకు గురవుతున్నారని, తాజాగా ఇదే కారణంతో ఐదుగురు మరణించారని అధికారులు తెలిపారు.