న్యూఢిల్లీ : యూపీ పోలీసులు నమోదు చేసిన కేసులో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఓ మతం మనోభావాలను దెబ్బతీశాడనే ఆరోపణలపై మరో కేసులో అరెస్టయిన జుబేర్ ఢిల్లీ పోలీసులు కస్టడీలో కొనసాగుతారు. యూపీ కేసులో జుబేర్ బెయిల్ పిటిషన్ను సీతాపూర్ కోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు,
హిందూ సన్యాసులను కించపరుస్తూ ట్వీట్ చేసినందుకు యూపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో జస్టిస్ ఇందిరా బెనర్జీ యూపీ ప్రభుత్వం, యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ జుబేర్కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్టు తెలిపారు. జుబేర్ ఎలాంటి ట్వీట్లు చేయరాదని, ఆధారాలు తారుమారు చేయరాదని కోర్టు స్పష్టం చేసింది.
జూన్ 1న నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించే మధ్యంతర బెయిల్ మంజూరైందని చెప్పారు. విచారణను నిలిపివేయడం, ఈ అంశంలో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని సర్వోన్నత న్యాయస్ధానం తేల్చిచెప్పింది. మధ్యంతర ఉత్తర్వులను సోమవారం వరకూ నిలిపివేయాలని యూపీ పోలీసుల తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది.