న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థల(Central Probe Agencies)ను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నట్లు ఇవాళ సుమారు 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టు(supreme court)ను ఆశ్రయించాయి. అయితే ఈ కేసును ఏప్రిల్ 5వ తేదీన విచారించనున్నారు. బీజేపీ ప్రత్యర్థి పార్టీలను సీబీఐ(CBI), ఈడీ(ED)లు టార్గెట్ చేస్తున్నట్లు విపక్షాలు తమ పిటిషన్లో ఆరోపించాయి. ఒకవేళ బీజేపీలో చేరితే అప్పుడు ఆ కేసులను రద్దు చేస్తున్నారని లేదా మూసివేస్తున్నారని విపక్షాలు పేర్కొన్నాయి. ఆ ఆరోపణలను బీజేపీ ఖండిస్తోంది. దర్యాప్తు సంస్థలు వ్యక్తిగతంగా పనిచేస్తున్నట్లు ఆ పార్టీ చెబుతోంది.
సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనూ సింఘ్వీ(Abhishek Manu Singhvi) ఈ కేసును సుప్రీంలో వేశారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిటిషన్ను స్వీకరించింది. రెండు వారాల్లోగా ఈ కేసును పరిశీలించనున్నట్లు కోర్టు తెలిపింది. అరెస్టుకు ముందు, తర్వాత చేపట్టాల్సిన మార్గదర్శకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. 95 శాతం కేసులన్నీ విపక్ష నేతలపై ఉన్నట్లు సింఘ్వీ తెలిపారు.
సుప్రీంకోర్టులో కేసు వేసిన వాటిల్లో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, జనతాదళ్, బీఆర్ఎస్(BRS), ఆర్జేడీ, సమాజ్వాదీ, శివసేన, ఎన్సీ, ఎన్సీపీ, లెఫ్ట్, డీఎంకే పార్టీలు ఉన్నాయి.