లక్నో : అలహాబాద్ హైకోర్ట్ (లక్నో బెంచ్) శుక్రవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ చట్టం 2004 రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేసింది. లౌకిక సిద్ధాంతాన్ని ఇది ఉల్లంఘించిందని పేర్కొంది.
ప్రస్తుతం మదర్సాల్లో చదువుతున్న విద్యార్ధులను సాధారణ విద్యా వ్యవస్ధలోకి మళ్లించే పధకాన్ని రూపొందించాలని జస్టిస్ వివేక్ చౌధరి, జస్టిస్ సుభాష్ విద్యార్ధితో కూడిన ధర్మాసనం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఇస్లామిక్ విద్యా సంస్ధలపై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో ఈ తీర్పు వెలువడటం గమనార్హం.
మరోవైపు విదేశాల నుంచి మదర్సాలకు వచ్చే నిధులపై దర్యాప్తు చేపట్టేందుకు యూపీ ప్రభుత్వం 2023 అక్టోబర్లో సిట్ ఏర్పాటు చేసింది. అన్షుమన్ సింగ్ రాథోడ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్ట్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
Read More :
MLA Kunamneni | త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చు!