Women bench | పలు కేసుల విచారణకు సంబంధించి ప్రత్యేక మహిళా ధర్మాసనాన్ని ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఇది మూడోసారి. ఈ ధర్మాసనంలో జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ బేల ఎం త్రివేది సభ్యులుగా ఉన్నారు. ఈ ప్రత్యే మహిళా ధర్మాసనానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఏర్పాటుచేశారు. ఈ ధర్మాసనం 11 వ నంబర్ కోర్టు హాల్లో నడిచింది. ఈ ధర్మాసనం వైవాహిక జీవితానికి సంబంధించిన 10 బదిలీ పిటిషన్లు, 10 బెయిల్ పిటిషన్ కేసులు, 9 సివిల్, 3 క్రిమినల్ కేసులను విచారించనున్నది.
మొదటి మహిళా ధర్మాసనం 2013లో న్యాయమూర్తులు జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్తో ఏర్పాటు చేశారు. రెండోది 2018 లో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీ బెంచ్ను అలంకరించారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం మహిళా న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ బేలా త్రివేది ఉన్నారు. 1989 లో ఈ సంఖ్య 11 గా ఉండేది. జస్టిస్ బీవీ నాగరత్న 2027 లో భారతదేశపు సర్వోన్నత న్యాయస్థానానికి మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి.