రాయ్పూర్: చత్తీస్ఘడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన నకల్స్ అందరూ కరుడుకట్టిన నక్సలేట్లు అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ(Deputy CM Vijay Sharma) తెలిపారు. ఆ నక్సల్స్ నుంచి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. మృతిచెందిన నక్సల్స్కు పోస్టు మార్టమ్ జరుగుతోందని, అది పూర్తి కావడానికి సమయం పడుతోందన్నారు. ప్రభుత్వం చర్చలకు, సంప్రదింపులకు సిద్ధంగా ఉందని, బస్తర్లో శాంతి కావాలన్నదే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు.ఇది ఎన్నికలకు సంబంధం లేని అంశమని, అభివృద్ధి పనులన్నీ బస్తర్ చేరాలన్నది తమ ఉద్దేశమన్నారు. గాయపడ్డ జవాన్లను నిన్న కలుసుకున్నామని, వాళ్లంతా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. ఆ జవాన్లు అంతా త్వరలో కోలుకోనున్నట్లు విజయ శర్మ తెలిపారు.
#WATCH | Raipur: On Kanker encounter, Chhattisgarh Deputy CM Vijay Sharma says, “All the Naxalites killed in the operation (in Kanker) were hardcore Naxals. A huge amount of arms and ammunition have been recovered from them…Their post-mortem is going on, it may take time… The… pic.twitter.com/SIaZx7snWN
— ANI (@ANI) April 17, 2024