ముంబై: మహరాష్ట్ర రాజధాని, దేశ వాణిజ్య నగరమైన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రం సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో గురువారం సాయంత్రం విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో అన్ని వ్యవస్థలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో చెక్ ఇన్, లగేజ్ కోసం ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. సర్వర్ల క్రాష్ వల్ల కంప్యూటర్లు పని చేయకపోవడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది మ్యానువల్ పద్ధతిని పాటిస్తున్నారు. దీంతో ప్రయాణికులు పలు గంటలపాటు క్యూలల్లో వేచి ఉన్నారు. దీని వల్ల విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. దీంతో విమానాశ్రయం అంతటా గందరగోళం నెలకొన్నది.
మరోవైపు ఇబ్బందులు ఎదుర్కొన్న విమాన ప్రయాణికులు తమ ఆవేదనను ట్విట్టర్లో వ్యక్తం చేశారు. చెక్ ఇన్ కౌంటర్ వద్ద తన బ్యాగ్ను ఉంచిన వెంటనే సిస్టమ్ క్రాష్ అయినట్లు ఒక మహిళ పేర్కొన్నారు. కాగా, ప్రయాణికుల ఇబ్బందిపై ఎయిర్ ఇండియా స్పందించింది. వారికి ఎదురైన అసౌకర్యాన్ని నివారించేందుకు తమ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ట్వీట్ చేసింది. అయితే ఎయిర్పోర్ట్టెర్మినల్ 2లో రెండు గంటల తర్వాత సాధారణ పరిస్థితి నెలకొన్నది.
System crash at #MumbaiAirport @airindiain #allairlines Crazy crowd and long queues. Expect delayed flights and more… pic.twitter.com/3ImGgmjUYy
— Kiwi (@kiwitwees) December 1, 2022
We understand that delays are certainly uncomfortable. Our team is working diligently to minimize the inconvenience. They'll be in touch with you for further updates.
— Air India (@airindiain) December 1, 2022