అహ్మదాబాద్ : కరోనా కట్టడికి విధించిన కఠిన నియంత్రణల నుంచి గుజరాత్ ప్రభుత్వం భారీ సడలింపులు ప్రకటించింది. జూన్ 4 నుంచి రాష్ట్రంలోని 36 నగరాల్లో అన్ని దుకాణాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెరిచిఉంచేందుకు అనుమతించింది. రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి రాత్రి పది గంటల వరకూ హోం డెలివరీ సర్వీసును అందించే వెసులుబాటు కల్పించింది.
ఇక జూన్ 4 నుంచి 11 వరకూ ఆయా నగరాల్లో రాత్రి కర్ఫ్యూను విధించనున్నట్టు గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.మరోవైపు గడిచిన 24 గంటల్లో గుజరాత్ లో 1561 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4869 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక కరోనా మహమ్మారి బారినపడి ఒక్కరోజే 22 మంది మరణించారు.