తిరువనంతపురం, మే 6: కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకొన్నది. దర్శనానికి ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేసింది.
వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి దేవస్థానం అధికారిక వెబ్సైట్లో వర్చువల్ క్యూ ద్వారా బుకింగ్ చేసుకొన్న వారినే అయ్యప్య దర్శనానికి అనుమతించనున్నారు. రోజుకు 80 వేల మంది మాత్రమే ఆయ్యప్పను దర్శించుకొనేలా ఆన్లైన్ బుకింగ్పై పరిమితి విధిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పుడు మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.