కశ్మీర్ ఫైల్స్ తెరకెక్కినప్పుడు లఖీంపూర్ ఫైల్స్ కూడా తెరకెక్కాలని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా అయినప్పుడు లఖీంపూర్ ఫైల్స్ కూడా సినిమా అవుతుందంటూ వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అఖిలేశ్ మొదటిసారిగా బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఆయన కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి పై విధంగా వ్యాఖ్యానించారు.
యూపీ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని అఖిలేశ్ స్పష్టం చేశారు. బీజేపీ పాలించి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా… ఇంకా మౌలిక సదుపాయాల సమస్యలే వున్నాయని ఎద్దేవా చేశారు. సమాజ్వాదీ పెరుగుతూనే వుందని, బీజేపీ తగ్గుతూ వస్తోందని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ ఓట్ల శాతం బాగా పెరిగిందని, దీన్ని బట్టే నైతిక విజయం సమాజ్వాదీకి దక్కుతుందని అఖిలేశ్ పేర్కొన్నారు.