లక్నో : యూపీ అసెంబ్లీలో విపక్ష నేతగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికకు మార్గం సుగమమైంది. శనివారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో అఖిలేష్ను ఎస్పీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో యూపీ అసెంబ్లీలో ఆయన విపక్ష నేత కానున్నారు. అఖిలేష్ను విపక్ష నేతగా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది.
యూపీ అసెంబ్లీలో అఖిలేష్ యాదవ్ను విపక్ష నేత కావాలని పార్టీ కోరుకుంటోందని ఎస్పీ నేత లాల్జీ వర్మ పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించేలా అఖిలేష్ యాదవ్ తన లోక్సభ ఎంపీ పదవికి రాజీనామా చేయడాన్ని వర్మ స్వాగతించారు. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయంతో యోగి ఆదిత్యానాధ్ సీఎంగా రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టారు.
లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో యూపీ సీఎంగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.