UP Polls : నేర చరిత ఉన్న వారికి సమాజ్వాదీ టిక్కెట్లించ్చిందన్న ఆరోపణలపై ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఆయన చేసిన చర్యను పూర్తిగా సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. గాయత్రీ ప్రజాపతిపై ఎలాంటి కేసులు లేవని, ఆయన భర్తపై మాత్రమే కేసులున్నాయని అఖిలేశ్ పేర్కొన్నారు. ఇక ఆజంఖాన్పై ఉన్న కేసులు బీజేపీ కాలంలోనే నమోదయ్యాయని, ఇక నహీద్ హసన్ విషయంలోనూ ఇదే జరిగిందని, బీజేపీ ప్రభుత్వమే ఆయనపై అనేక కేసులు పెట్టిందన్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్న మంత్రి గాయత్రీ ప్రజాపతి భార్య మహారాజీ దేవిని అమేథీ నుంచి అఖిలేశ్ బరిలోకి దింపారు.
ఇక మరో సీనియర్ నేత ఆజంఖాన్ కూడా చాలా రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం కూడా విదితమే. ఇక మరో నేత నషీద్ హసన్ కూడా ఇదే కోవకు చెందిన నేత. ఈ నేపథ్యంలోనే సమాజ్వాదీ పార్టీపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ కూడా గ్యాంగ్స్టర్ పార్టీ అయిపోయిందని అధికార బీజేపీ తీవ్రంగా ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలోనే సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వారికి టిక్కెట్లివ్వడాన్ని పూర్తిగా సమర్థించుకున్నారు.