Akhilesh yadav | కోవిడ్ సందర్భంగా వర్చువల్ ర్యాలీలు నిర్వహించాలని ఈసీ నిబంధన పెడితే మాత్రం అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఈసీ చేయాలని సమాజ్వాదీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. డిజిటల్ ప్లాట్ఫారమ్స్ను అందించడంలో ఈసీఈ మద్దతివ్వాలని తాము కచ్చితంగా డిమాండ్ చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. కరోనా నేపథ్యంలో వర్చువల్ ర్యాలీయే నిర్వహించాలని ఈసీఈ కొత్త నిబంధన విధించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
మరోవైపు బీజేపీపై మాజీ సీఎం అఖిలేశ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన ఫొటోను ఉపయోగించుకుంటూ బీజేపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తోందని, దీనిపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరిచారు. ముఖ్యంగా బీజేపీ ఐటీ హెడ్ ఇలా చేస్తున్నారని, డబ్బులు తీసుకుంటూ తప్పుడు ప్రచారానికి ఒడిగడుతున్నారని అఖిలేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము గనక అధికారంలోకి వస్తే యువకులకు కచ్చితంగా ఉచితంగా లాప్టాప్లను అందజేస్తామని అఖిలేశ్ హామీ ఇచ్చారు.