Akhilesh yadav | ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే గృహోపకరణాల కోసం 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు హామీ ఇచ్చారని సీనియర్ నేతలు పేర్కొన్నారు.