Akhilesh Yadav | లక్నో, డిసెంబర్ 21: రైల్వే, మెట్రో స్టేషన్లు, క్రూయిజ్లలో మద్యం అమ్మకాలు చేపట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకోవడానికి బీజేపీ ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న ఏకైక మార్గం మద్యం అమ్మడం. రేపోమాపో నడిరోడ్లపైనే అమ్మకాలు చేపడుతుందేమో. నా సలహా ఏమిటంటే బీజేపీ కార్యాలయాల్లో కూడా మద్యం అమ్మకాలు చేపడితే ఇంకా బాగుంటుంది’ అని అఖిలేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.