న్యూఢిల్లీ, ఆగస్టు 3: మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్క్ (కేఎన్పీ)లో చీతాలు మరణిస్తుంటే..కేంద్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా 9చీతాలు చనిపోయాయని, ఈ పరిణామాలు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
‘కేఎన్పీలో 9వ చీతా మరణించింది. దీనికి ఎవరు బాధ్యులు? విదేశాల నుంచి చీతాలను తీసుకొచ్చామని గొప్పగా ప్రచారం చేసుకున్నవారు ఎటుపోయారు?’ అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి అఖిలేశ్ ప్రశ్నించారు. ‘భారత్కు పంపిన చీతాలు మరణిస్తున్నాయని దక్షిణాఫ్రికా, నమీబియాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతర్జాతీయంగా భారత్ పరువుప్రతిష్టలకు భంగం కలిగింది’ అని హిందీలో ట్వీట్ చేశారు.