రైతు నేత టికాయత్ తమతో కలిసి ఎన్నికల గోదాలోకి దిగుతానంటే తమకెలాంటి అభ్యంతరమూ లేదని సమాజ్వాదీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తేల్చి చెప్పారు. ఆయన ఎన్నికల గోదాలోకి దిగుతానంటే తాము స్వాగతిస్తామని ఆయన పేర్కొన్నారు. టికాయత్ ఓ రైతు నేత అని, రాజకీయాలకు అతీతంగా ఆయన రైతు ఉద్యమాన్ని నడుపుతున్నారని అఖిలేశ్ కొనియాడారు.
”ఎన్నికల గోదాలోకి తమతో కలిసి దిగుతానంటే టికాయత్ను స్వాగతిస్తా. ఆయన రైతు నేత. రైతు ఉద్యమాన్ని కూడా రాజకీయాలకు అతీతంగానే నడుపుతున్నారు. అయితే రాజకీయాల్లోకి వస్తానని ఆయన నిశ్చయించుకోవాలి కదా” అని అఖిలేశ్ అన్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చే విషయంపై టికాయత్ చాలా సార్లు ఓ క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయాల్లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదని, తాను రాజకీయ పార్టీని నడపడం లేదని స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్నది కూడా తాము ఓ నిర్ణయానికి రాలేదని, రైతు నేతలతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని టికాయత్ స్పష్టం చేశారు.