Akhilesh yadav | ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి యోగిపై చాలా తీవ్రమైన ఆరోపణలు వున్నాయని, ఎవరైనా పిటిషన్ను దాఖలు చేస్తే, కేసులను పునః పరిశీలిస్తామని అఖిలేశ్ సంచలన ప్రకటన చేశారు. భారతీయ శిక్షా స్మృతిలో ఉన్న సెక్షన్ల కంటే సీఎం యోగి, డిప్యూటీ సీఎం మౌర్యపై ఉన్న కేసుల సంఖ్యే ఎక్కువగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. నెగెటివ్గా ఆలోచించే వారిని తరిమి కొట్టాలని యూపీ ప్రజలు నిర్ణయించుకున్నారని, యూపీ అంతటా ఇదే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యూపీలో జరుగుతున్న ఎన్నికలు సోదరభావానికీ, బీజేపీకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అఖిలేశ్ అభివర్ణించారు. ఇక మార్చి 10 తర్వాత అఖిలేశ్లో వున్న వేడిని శాంతింపజేస్తామన్న సీఎం యోగి వ్యాఖ్యలకు అఖిలేశ్ కౌంటర్ ఇచ్చారు. వేడి లేకపోతే మనుషులు చనిపోతారని, శరీరంలో వేడి రక్తం ప్రవహించడం ఆగిపోతే… ఎలా బతుకుతాం? అంటూ అఖిలేశ్ కౌంటర్ ఇచ్చారు.