న్యూఢిల్లీ: ఇన్నేండ్లయినా మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం శోచనీయమని అకాలీదళ్ నేత నరేష్ గుజ్రల్ (Naresh Gujral) అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళా బిళ్లును ప్రవేశపెట్టాల్సిన బాధ్యత బీజేపీపై (BJP) ఉందని చెప్పారు. పార్లమెంటులో మెజారీటీ ఉంటే మహిళా బిల్లును ఆమోదింపజేస్తామని బీజేపీ మొదటిసారి 2014 ఎన్నికల సమయంలో, 2019లో మరోసారి తన మేనిఫెస్టోలో (Manifesto) హామీ ఇచ్చిందని, మరి ఇంకా ఎందుకు ఆలస్యమని ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు (Women’s Reservation Bill) అమలు చేయాలనే డిమాండ్తో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేస్తున్న భారత జాగృతి (Bharat Jagruthi) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) నరేష్ గుజ్రాల్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటిసారి 1996లో పార్లమెంటు ముందుకు మహిళా బిల్లు వచ్చిందని, అన్ని పార్టీలు సమర్ధించాయి కానీ ఎందుకో ఆమోదం పొందలేదని చెప్పారు.
బీజేపీ తన మేనిఫెస్టోలో బిల్లు తెస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ఆగస్టు 15న ఎర్రకోట నుంచి నారీ శక్తి (Naari Shakthi) గురించి గొప్పగా మాట్లాడుతారని, కానీ మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రం లోక్సభలో ప్రవేశపెట్టరని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత పోరాటానికి అకాలీదళ్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.