Padma Awards | రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్రపది ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం జనవరిలో పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 139 మందికి కేంద్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషన్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.
#WATCH | Actor and Andhra Pradesh MLA Nandamuri Balakrishna receives Padma Bhushan award from President Droupadi Murmu for his contribution to the field of Art.
(Video Source: President of India/YouTube) pic.twitter.com/YAHohendso
— ANI (@ANI) April 28, 2025
వైద్యరంగంలో దువ్వూరి నాగేశ్వర్రావుకు పద్మభూషణ్, ప్రజా వ్యవహారాల కేటగిరిలో మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ తెలంగాణ నుంచి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా దువ్వూరి నాగేశ్వర్రావు పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అలాగే, చిత్ర పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, తమిళ నటుడు అజిత్ కుమార్, అరిజిత్ సింగ్తో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్రపతి నుంచి పద్మ అవార్డులను అందుకున్నారు.
#WATCH | Actor S. Ajith Kumar receives Padma Bhushan award from President Droupadi Murmu for his contribution to the field of Art.
(Video Source: President of India/YouTube) pic.twitter.com/itn6ReBXH2
— ANI (@ANI) April 28, 2025