Ajit Pawar : బారామతి (Baramati) లో విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర (Maharastra) డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా (Amith Shah), నితిన్ గడ్కరీ (Nitin Gadkari), మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితర రాజకీయ ప్రముఖులు ఈ అంతక్రియల్లో పాల్గొన్నారు.
అజిత్ పవార్ను కడసారి చూసేందుకు ఆయన వర్గం ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున మైదానానికి వచ్చి అధినేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. విమానం రన్వేపై దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది.
దాంతో అజిత్ పవార్తోపాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బారామతికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పవార్కు భార్య సునేత్ర పవార్, ఇద్దరు కుమారులు పార్థ్, జే ఉన్నారు.