న్యూఢిల్లీ: అబుదాబీ నుంచి కాలికట్కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య వల్ల ఇంజిన్లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి అబుదాబీ విమానాశ్రయానికి సురక్షితంగా తీసుకొచ్చారు. దీంతో 184 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందితో గొడవకు దిగారు. ఉన్నతాధికారుల జోక్యంతో గొడవ సద్దు మణిగింది.