Gold Seized | తమిళనాడు తిరుచ్చి ఎయిర్పోర్ట్ (Trichy Airport)లో భారీగా బంగారం పట్టుబడింది (Gold Seized). షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి వెయ్యి గ్రాములకు పైగా 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు (Custom Officials) తెలిపారు.
ప్రయాణికుడు ఫిబ్రవరి 28వ తేదీన IX 614 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో షార్జా (Sharjah) నుంచి తిరుచ్చి వచ్చినట్లు తెలిపారు. ఎయిర్పోర్ట్లో నిర్వహించిన తనిఖీల్లో సదరు ప్రయాణికుడి వద్ద 1061 గ్రాముల 24 క్యారెట్ల బంగారం పట్టుబడినట్లు చెప్పారు. పట్టుబడిన బంగారం విలువ రూ.69 లక్షల వరకూ ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
Tiruchirappalli, Tamil Nadu: The Air Intelligence Unit of Trichy Airport seized 1061 grams of 24 carat Gold valued at Rs.66.68 lakh, extracted from a paste-like material concealed by one male passenger in his rectum. The passenger traveled from Sharjah to Trichy by IX 614 Air… pic.twitter.com/8ot9qoNl0K
— ANI (@ANI) March 1, 2024
Also Read..
Road accident | నార్సింగిలో టిప్పర్ బీభత్సం.. పాదచారుడి మీదకు దూసుకెళ్లడంతో ఒకరు మృతి
Pocharam Srinivas Reddy | కాళేశ్వరం గొప్పదనాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్: పోచారం