హైదరాబాద్ : నార్సింగిలో(Narsingi) ఓ టిప్పర్(Tipper )బీభత్సం సృష్టించింది. మూవీ టవర్ రోడ్డులో పాద చారుని పైకి దూసుకొళ్లింది. ఈ ప్రమాదంలో టిప్పర్ చక్రాల కిందపడి ఓ పాదచారుడు(Pedestrian) అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.