ముంబై : ముంబై విమానాశ్రయంలో మంగళవారం ఎయిరిండియా జెట్, ఇండిగో విమానానికి చెందిన రెక్కలు పరస్పరం ఢీకొన్నాయి. రెండు విమానాల రెక్కల చివర్లు తగులుతూ వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను రెండు ఎయిర్లైన్స్ ధ్రువీకరించాయి.
అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కోయంబత్తూరు వెళ్లవలసిన ఏఐ12732 టేకాఫ్కు ముందు ట్యాక్సీవేపై ఉన్న మరోఎయిర్లైన్స్కు చెందిన విమానానికి చేరువలో వచ్చిందని, రెండు విమానాల రెక్కల అంచులు పరస్పరం తాకాయని ఎయిరిండియా తెలిపింది.