Air India A350 | ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్బస్ ఏ350 తొలి విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానానికి ఎయిర్ ఇండియా ఘన స్వాగతం పలికింది. నయా లోగోతో కొత్త లుక్లో ఉన్న ఎయిర్ ఇండియా ఏ350 విమానం వద్ద కొత్తగా డిజైన్ చేసిన యూనిఫాంలో ఉన్న సిబ్బంది ఫోజులిచ్చారు. విమానానికి సంబంధించిన ఫొటోలనును ఎయిర్ ఇండియా అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. వైరల్గా మారాయి. ఇదిలా ఉండగా.. ఎయిర్ ఇండియా ఇటీవల ఎయిర్బస్, బోయింగ్ నుంచి దాదాపు 6.5లక్షల కోట్ల వ్యయంతో 740 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇందులో ఫ్రాన్స్కు చెందిన ఎయిర్బర్ నుంచి 250 విమానాలను కొనుగోలు చేస్తుంది. అమెరికాకు చెందిన బోయింగ్ నుంచి 220 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎయిర్బస్ నుంచి తొలి విమానాన్ని ఎయిర్ ఇండియా అందుకున్నది. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను మళ్లీ టాటా గ్రూప్ చేజిక్కించుకున్నది. ఈ క్రమంలో కంపెనీని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నది.
ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎయిర్ ఇండియా విమానాలను కొనుగోలు చేస్తున్నది. చివరిసారిగా 2005లో బోయింగ్ నుంచి 68, ఎయిర్బస్ నుంచి 43 విమానాలను కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. ఎయిర్ ఇండియా ఏ350 విమానాలను జనవరి నుంచి నడుపనున్నట్లు తెలుస్తున్నది. విమానం ప్రయాణానికి ముందు కస్టమ్స్ క్లియరెన్స్, డీజీసీఏ తనిఖీలు, ప్రూవింగ్ ఫ్లైట్లతో సహా అనేక పోస్ట్-అరైవల్ రెగ్యులేటరీ ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రయాణికులతో వెళ్లడానికి ముందు విమానం సర్టిఫికేషన్ను సైతం పూర్తి చేయాల్సి ఉంటుంది. 2024 మధ్య నాటికి ఆరు సర్వీసులను ఏ350 విమానాలను నడపాలని ఎయిర్ ఇండియా భావిస్తున్నది.
India’s first @Airbus A350-900 has come home in the bold, new Air India livery, and it received a grand welcome at @DelhiAirport.
It is touchdown of a new Air India. For a new, resurgent India.#AI350 #AirIndia #FlyAI #ThisIsNewAirIndia pic.twitter.com/V1vKk6m81V
— Air India (@airindia) December 23, 2023