న్యూఢిల్లీ : అమెరికా 5జీ కమ్యూనికేషన్ల విస్తరణను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ నుంచి అమెరికా సర్వీసులను తగ్గించింది. ఇందులో భాగంగా కొన్ని సర్వీసులను రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ను త్వరలో తెలిపనున్నట్లు ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. యూఎస్ ప్రభుత్వం ప్రస్తుత 5G రోల్అవుట్ ప్లాన్ విమానయానంపై ప్రభావం చూపే అవకాశం ఉందని యునైటెడ్ ఎయిర్లైన్స్ పేర్కొంది. 1.25 మిలియన్ల యునైటెడ్ ప్రయాణికులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపింది.
కనీసం 15వేల విమానాలు, 40 కంటే ఎక్కువగానే భారీ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే అవసరమైన వస్తువులు, సరుకు రవాణాను ప్రభావం చేస్తుందని పేర్కొంది. రన్వేల పక్కన అమర్చినప్పుడు 5జీ సిగ్నల్స్ పైలట్లు విమానం టేకాఫ్ చేయడానికి, ప్రతికూల వాతావరణంలో ల్యాండ్ చేయడానికి అవసరమయ్యే కీలకమైన భద్రతా పరికరాలకు ఆటంకం కలిగిస్తాయని యునైటెడ్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. భద్రతపై తాము రాజీపడమని స్పష్టం చేసింది. ఇతర దేశాలు 5జీ సాంకేతికతను సురక్షితంగా అమలు చేసేలా విధివిధానాలు విజయవంతంగా రూపొందించాయని, తాము సైతం అమెరికా ప్రభుత్వాన్ని అదే పని చేయాలని కోరుతున్నామని తెలిపింది.