పాట్నా: బీహార్లోని ఎంఐఎం పార్టీ నేత అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లమ్ ముఖియాను కాల్చివేశారు(Shot Dead). ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్లో జరిగింది. అబ్దుల్ సలామ్ ఆ రాష్ట్ర ఎంఐఎం కార్యదర్శిగా ఉన్నారు. గోపాల్గంజ్ జిల్లా అధ్యక్షుడు కూడా. అయితే బైక్ మీద వచ్చిన కొందరు దుండగలు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన పట్ల సిట్ను ఏర్పాటు చేశారు.
నిందితుల్ని అరెస్టు చేసేందుకు రెయిడ్స్ చేస్తున్నట్లు తెలిపారు. తూటాలకు బలైన వ్యక్తిని ఎంఐఎం నేతగా గుర్తించామని, ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని ఎస్డీపీవో ప్రంజల్ కుమార్ తెలిపారు. అస్లమ్ కాల్చివేత ఘటనను ఖండిస్తూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు.