న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని కోరుతూ ఐదు రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. గత కొద్దిరోజులుగా కొవిడ్-19 కేసులు రోజుకు 1500 నుంచి ఇటీవల 4000 వరకూ చేరుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
కరోనా కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్ఎన్ఏ వైరస్ మ్యుటేట్ అవుతుంటుందని ఎయిమ్స్ ప్రొఫెసర్ పేర్కొన్నారు . వ్యాధి తీవ్రత పెరగడం, మరణాల సంఖ్య కీలకమని ఈ కోణంలో కరోనా పరిస్ధితి ప్రస్తుతం మెరుగ్గా ఉందని ఎయిమ్స్కు చెందిన సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ చెప్పారు.
ఈ తరహా వైరస్లు వేగంగా అంతం కావని, హెచ్చుతగ్గులు సాగుతూనే ఉంటాయని అన్నారు. వైరస్ నుంచి మనం సాధారణ పరిస్ధితి దిశగా పయనించాలని పేర్కొన్నారు. ఇక శనివారం భారత్లో 0.89 శాతం పాజిటివిటీ రేటుతో 3962 తాజా కేసులు వెలుగుచూశాయి. ఇక ఈ నెలలోనే మూడు రోజులు రోజు వారీ కేసుల్లో పెరుగుదల నమోదైంది.