న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు విజ్ఞప్తితో 11 రోజుల సమ్మెను ఎయిమ్స్ వైద్యులు విరమించారు. (AIIMS Calls Off Strike) దేశ ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాసేవా స్ఫూర్తితో డాక్టర్ల సమ్మెను విరమించినట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై దారుణ హత్యాచారానికి నిరసనగా ఎయిమ్స్ వైద్యులు సమ్మెబాట పట్టారు. అయితే ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ గురువారం అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో 11 రోజుల సమ్మెను విరమిస్తున్నట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డీఏ) తెలిపింది. కోర్టు చర్యను అభినందిస్తున్నామని, కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొంది. పేషెంట్ కేర్ తమ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించింది.
కాగా, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ సంఘటన, దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది భద్రతకు సంబంధించిన విస్తృత సమస్యను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టుకు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. సుప్రీంకోర్టు అప్పీల్ మేరకు దేశ ప్రయోజనాల దృష్ట్యా, ప్రజాసేవా స్ఫూర్తితో 11 రోజుల సమ్మెను విరమించుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొంది.
In the interest of the nation and in the spirit of public service, the RDA, AIIMS, New Delhi, has decided to call off 11-day strike. This decision comes in response to the appeal and direction of the Supreme Court. We extend our sincere appreciation to the Supreme Court for… pic.twitter.com/fCxWJqM6So
— ANI (@ANI) August 22, 2024