ఉప రాష్ట్రపతి వెంకయ్య చేతుల మీదుగా విడుదల
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కరోనా నియమాలు, వైద్యసిబ్బంది పాటించాల్సిన మార్గదర్శకాలను సూచిస్తూ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) రూపొందించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఏఐజీ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయమైన అంశాలు, అనుభవాలతో ఈ పుస్తకాన్ని రూపొందించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా లక్ష మంది డాక్టర్లకు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐజీ డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు తదితరులు పాల్గొన్నారు.