చెన్నై: అన్నాడీఎంకే(AIADMK) పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. బీజేపీతో పొత్తుకు బ్రేకప్ చెప్పేసింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్ర బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యే, జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేపట్టారు. బీజేపీ, ఎన్డీఏతో అన్ని సంబంధాలను తెంపుకుంటున్నట్లు అన్నాడీఎంకే నేత ప్రకటించారు.