మల్కన్గిరి: దేశంలోనే మొట్టమొదటిసారిగా.. మలేరియాను గుర్తించే ఏఐ ఆధారిత మైక్రోస్కోప్ను ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా ప్రభుత్వ దవాఖానలో ప్రవేశపెట్టారు. ఈ మైక్రోస్కోప్ సేవల్ని జిల్లా ముఖ్య వైద్య అధికారి ప్రఫుల్ కుమార్ నందా బుధవారం దవాఖానలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మలేరియాను క్లినికల్గా అత్యంత కచ్చితత్వంతో గుర్తించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.
‘స్టార్టప్’ ప్రోగ్రామ్ కింద ఐఐటీ-బాంబే సైంటిస్టులు ఏఐ మైక్రోస్కోప్ను తయారుచేశారు. మలేరియాలో పీ-వీవాక్స్ (పరాన్నజీవి) కన్నా పీ-ఫాల్సిపారంతో వచ్చే వ్యాధి తీవ్రత ఎక్కువ. ఈ రెండింటి మధ్య తేడాను ఏఐ మైక్రోస్కోప్ సులభంగా గుర్తిస్తుందని వైద్యులు తెలిపారు.